*ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు*
*మంచిర్యాల్, జూన్ 13*
మంచిర్యాలలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు. పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులంతా శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అల్లాను ప్రార్థించినట్లు భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు మాజీ మంత్రివర్యులు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే, ఎల్డీఎమ్మార్సీ సలహాదారు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కే. ప్రేమ్ సాగర్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.