సమస్యను పరిష్కారించాలని అధికారులను ఆదేశించిన వర్కింగ్ ప్రెసిడెంట్*
♦ *మధిరలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు*
మధిర, జులై 28:
మధిర నియోజకవర్గం మధిర మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సమయంలో.. తనకు అన్యాయం జరిగిందని.. న్యాయం చేయాలని ఒక మహిళ భట్టి విక్రమార్క మల్లుతో కన్నీటి పర్యంతం అయ్యారు. గతంలో తాము కొన్న భూమి వివాదంలో ఉందని.. ఆమె భట్టికి విన్నవించుకున్నారు. ఆమె ఆవేదన విన్న భట్టి విక్రమార్క.. వెంటనే ఆమెకు న్యాయం చేయాలని స్థానిక తహసీల్దార్ మంగీలాల్ ను భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగరాదాని భట్టి అధికారులకు చెప్పారు.