భట్టి బృందానికి ఘన స్వాగతం
▶ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన
▶ ప్రచార కమిటీ చైర్మన్ భట్టికి నీరాజనం పడుతున్న ప్రజలు
పాలమూరు యూనివర్సిటీ, అక్టోబర్ 11: కాంగ్రెస్ ఎన్నికల ప్రచార బృందానికి తెలంగాణ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికల ప్రచార యాత్ర తొలివిడత రెండో రోజు.. మహబూబ్ నగర్ జిల్లా భగీరథ కాలనీలో మొదలయింది. అక్కడనుంచి పాలమూరు యూనివర్సిటీ, బండమీదపల్లి, హనుమాన్ పూర్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, అశోక టాకీస్, క్లాక్ టవర్ మీదుగా మహబూబ్ నగర్ పట్టణం చేరుకుంది.
✅ భారీ ర్యాలీ
ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలోని బృందానికి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు అప్పోర్వ స్వాగతమ్ పాలికారు. వందలాది వాహనాలతో.. వేలాదిమంది ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.