*ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్కకు ప్రజల మద్దతు*
రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీకి ప్రజలనుంచి ఊహించని స్పందన లభించింది. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క మల్లు చేపట్టిన రెండో విడత ప్రచారం నేడు మేడ్చల్ నియోజకవర్గంలో కొనసాగింది. నియోజకవర్గంలోని నాగారం, దమ్మాయిగూడ, జవహర్ నగర్లో భట్టి విక్రమార్క పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.