మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా.. మండలంలోని వీవీ కృష్ణాపురం గ్రామంలో ఊర చెరువు వద్ద రూ. 3 లక్షలతో నిర్మిస్తున్న కల్వర్టు-1 నిర్మాణానికి భట్టి విక్రమార్క మల్లు శంఖుస్థాపన చేశారు.
అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు వస్తున్న భట్టి విక్రమార్కకు కృష్ణాపురం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కిలోమీటరు వరకు దాదాపు 40 బైక్ లతో ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కృష్ణాపురం గ్రామంలో ఉన్న భారతరత్న బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.