*ఎర్రుపాలెం మండలంలో అధికార పార్టీకి భారీ షాక్*
▶ *భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన 45 కుటుంబాలు*
▶ *అభివృద్ధి చూసే*
🔴 *ప్రచార కమిటీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క మల్లు*
మధిర (ఎర్రుపాలెం), అక్టోబర్ 8: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో అధికార పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీ సంఖ్యలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో నుంచి దాదాపు 45 కుటుంబాలు భట్టి సమక్షంలో కాంగ్రెస్ లో చేరాయి. మధిర అభివృద్ధి విక్రమార్క వల్లే సాధ్యం అనే విశ్వాసంతో కాంగ్రెసులో చేరినట్లు వారు చెప్పారు.